Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంధాన్ని ముఖానికి పట్టిస్తే..?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:31 IST)
చర్మ సౌందర్యానికి గంధం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. గంధాన్ని అరగదీసి కళ్ళమీద రాసుకుంటే కళ్ళ ఎరుపు మంటలు తగ్గుతాయి. చందనంతో తయారైన సోపులు, పౌడర్లు వాడితే చర్మానికి మంచిది. ఇంకా స్నానం చేసే నీళ్ళల్లో గంధం నూనె 5 లేదా 6 చుక్కలు వేసుకుని స్నానం చేస్తే వ్యాధులు రావు. శరీరం తాజాగా ఉంటుంది. చందనాది తైలం వలన తలనొప్పి కళ్ళమంటలు తగ్గుతాయి. 
 
గంధాన్ని అరగదీసి అందులో కొద్దిగా పసుపు, రోజ్‌వాటర్ చేర్చుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఆపై అరగంటపాటు అలానే ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. ముడతలు చర్మం ఉండదు. 
 
ఆలివ్ ఆయిల్‌లో గంధం కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. గాయాలకు చందనం పూస్తే వెంటనే మానిపోతాయి. గంధం చర్మానికి యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. గంధాన్ని అరగదీసి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం నున్నంగా తయారవుతుంది. గంధంలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మానికి మంచి ప్యాక్‌లా ఉపయోగపడుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments