మహిళల్లో ఇరెగ్యులర్ పీరియెడ్స్... ఏం చేయాలి?

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (20:06 IST)
చాలామంది మహిళల్లో పీరియెడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత ఏర్పడి సమస్య తగ్గే అవకాశం వుంటుంది. ముఖ్యంగా గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లే కాకుండా, వీటిలో వుండే జింక్, సెలీనియం ఎలిమెంట్స్ వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.
 
సమస్య వున్నవారు సీడ్ సైక్లింగ్ పాటించాలి. అంటే... ఓ సైకిల్‌లా గింజలు తీసుకోవడం అన్నమాట. గుమ్మడి గింజలు, అవిసె గింజలు మొదటి రోజు నుంచి 14 రోజుల వరకూ ఓ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. మొదటి రోజు అంటే పీరియడ్స్ ప్రారంభమైన రోజు. ఇక 15వ రోజు నుంచి 28వ రోజు వరకూ నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు ఓ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఒకేసారి కాకుండా 3 భాగాలు చేసి మూడు పూటలా తీసుకోవాలి. గింజలను పొడి చేసి మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఈ గింజలు తీసుకోవడంతో పాటు వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. 
 
ఇలా చేయడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి. జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. అధిక బరువు తగ్గుతారు. పీరియడ్స్ ముందు వచ్చే అనారోగ్యం తగ్గుతుంది. సంతానలేమి, మెనోపాజ్ లో వున్నవారు, గర్భసంచి తొలగించినవారు కూడా గింజలు తీసుకోవడం వల్ల ప్రయోజనం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం

పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం

Nara Lokesh: కోవా బన్ విక్రేత వలిని త్వరలో కలుస్తా.... మంత్రి నారా లోకేష్ (video)

మహా శివరాత్రి.. సామర్లకోటలో రికార్డ్ డ్యాన్సులు

Bill Gates: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న బిల్ గేట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments