మహిళలు ఆఫీసుల్లో తినకూడని పదార్థాలు (video)

పురుషులకు సమానంగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. అయితే గృహిణిగానూ, వర్కింగ్ ఉమెన్‌గా ఇరు పడవల్లో ప్రయాణం చేసే మహిళలు.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా ఒబి

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (10:26 IST)
పురుషులకు సమానంగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. అయితే గృహిణిగానూ, వర్కింగ్ ఉమెన్‌గా ఇరు పడవల్లో ప్రయాణం చేసే మహిళలు.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా ఒబిసిటీ వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. పురుషులతో ధీటుగా అన్నీ రంగాల్లో రాణించే మహిళలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటేనే ఆయుష్షును పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అందుకే పోషకాహారం తీసుకోవాలని.. స్నాక్స్‌గా ఏవి పడితే అవి తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు వర్కుప్లేసులో రకరకాల స్నాక్స్‌ తింటుంటారు. ఫలితంగా వారిలో కాలరీలు బాగా పెరుగుతాయి. అందుకే ఆఫీసులో పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో చాలామంది ఆడవాళ్లు బిస్కెట్లు తింటుంటారు. బిస్కెట్లు ఒకటి రెండు పర్లేదు కానీ ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. బిస్కెట్లను వెజ్ ఆయిల్, పంచదార, మైదాపిండితో తయారు చేస్తారు. వీటిని తినడం ద్వారా శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. తద్వారా బరువు పెరుగుతారు.  
 
అలాగే కార్యాలయాల్లో మిల్క్ కాఫీకి కూడా దూరంగా ఉండాలి. ఇది ఒక కప్పు తాగినా శరీరంలో కేలరీలు బాగా పెరుగుతాయి. బ్లాక్ టీ, లెమన్ టీ తీసుకోవచ్చు. కొందరు కేక్స్‌ బాగా తింటుంటారు. వీటిని వారంలో ఓ నాలుగైదు సార్లు తింటే చాలు బరువు బాగా పెరిగిపోతారు. అందుకే తాజా కూరగాయల సలాడ్స్, ఫ్రూట్స్, తృణధాన్యాలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా మహిళలు ఆరోగ్యంగా వుంటారని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

అమెరికాకు షాకిచ్చిన ఇటలీ... మా భూమిపై మీ యుద్ధ విమానాలకు నో పర్మిషన్

రష్యాలో ఘోరం... కొండను ఢీకొట్టిన విమానం... 29 మంది దుర్మరణం

మీరూ మా శత్రువులే.. ఇక అమెరికా టెక్ కంపెనీలపై దాడులు : ఇరాన్

మీ చావు మీరు చావండి... యుద్ధాన్ని ఆపేస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'ధురంధర్ : ది రివెంజ్'

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

తర్వాతి కథనం
Show comments