హైదరాబాదు మహా నగరంలో గణేశ్ విగ్రహాల తయారీ ముమ్మరం

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (18:31 IST)
ప్రతి ఏడాది నిర్వహించే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ విశిష్ట గణపతి తయారీ పనులు ప్రారంభించినట్లు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు.
 
ఈ ఏడాది మహా విష్ణువు రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్ మహాగణపతిని కేవలం 9 అడుగులు ఎత్తులో మట్టితో తయారు చేస్తున్నామని తెలిపారు. 66వ ఏట రూపొందిస్తున్న ఖైరతాబాద్ గణనాథుడికి శ్రీ ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా నామకరణం చేసారు. ఈ విగ్రహానికి ఓవైపు లక్ష్మీదేవి మరోవైపు సరస్వతీ దేవి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ విగ్రహాలు మట్టితో తయారుచేసి, అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ రహితంగా ఖైరతాబాద్ గణనాథుడిని నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో భక్తులు ఎవ్వరూ రావద్దని... ఆన్లైన్ ద్వారా దర్శనం చేసుకోవాలని గణేశ్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.
 
ఇక ప్రతి ఏడాది ఆగస్టు నెల వచ్చిందంటే చాలు నగరం అంతా వినాయకుల మండపాలతో, సందళ్లతో నిండిపోతాయి. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అన్ని పండుగులను ఇండ్లలోనే చేసుకున్నట్లుగానే ఆ గణనాథుని కూడా ఇంట్లోనే నిలుపుకొని పూజించాలని అధికారులు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments