Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిదాకు మూడేళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

ఫిదాకు మూడేళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..
, మంగళవారం, 21 జులై 2020 (13:42 IST)
కరోనా వేళ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒకటి ట్రెండింగ్‌ అవుతున్నాయి. హీరోల బర్త్‌డేలు, సినిమా యానివర్సరీలు, పలు ఆసక్తిర అంశాలు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఫిదా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ సన్నివేశాలు వీడియో ద్వారా విడుదల చేశారు. 
 
ఇక సూపర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క జూలై 20, 2020తో ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి లేడి సూపర్‌స్టార్‌గా అభిమానులచే పిలవబడుతున్న అనుష్కకి పలువురు విషెస్ అందిస్తున్నారు.
 
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజలకి తన స్వరంతో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ అందించాడు. రైలు కోసం ప్లాట్‌ఫాంపై వెయిట్ చేయాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదు. సక్సెస్ అనేది కూడా వెయిట్ చేస్తేనే వస్తుందని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్‌ - ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్, బడా ప్రొడ్యూసర్ భారీ స్కెచ్..!