Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుని ''చింతామణి గణపతి'' అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ప్రాచీన కాలం నుండి తొలి పూజలు అందుకుంటుంటారు. గణపతి ప్రధాన దైవంగా కొలువైన క్షేత్రాలు మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ప్రతి ఆలయంలోను వినాయకుడి మూర్తి తప్పకుండా

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:46 IST)
ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ప్రాచీన కాలం నుండి తొలి పూజలు అందుకుంటుంటారు. గణపతి ప్రధాన దైవంగా కొలువైన క్షేత్రాలు మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ప్రతి ఆలయంలోను వినాయకుడి మూర్తి తప్పకుండా కనిపిస్తుంది. పిల్లలు నుండి పెద్దల వరకు గణపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
 
గణపతి ఆవిర్భవించిన క్షేత్రాలలో మహారాష్ట్ర ప్రాంతంలోని పూణె జిల్లాలోని ధైవూర్ ఒకటి. అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా చెప్తున్న ఇక్కడి గణపతిని చింతామణి గణపతిగా భక్తులు పూజిస్తుంటారు. ఈ చింతామణి పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు చింతామణి ఉండేది. 
 
రాజ వంశానికి చెందిన గణరాజు ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును గణపతి సంహరించి ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగించాడు. కపిల మహర్షి కోరిక మేరకు గణపతి ఇక్కడ కొలువుదీరాడు. అందువలనే ఇక్కడి స్వామిని చింతామణి స్వామిగా పూజిస్తుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments