గరిక పోచలతో వినాయక పూజ చేస్తే?

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:23 IST)
విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థినాడు పూజించే భక్తులకు క్షేమం, లాభం కలుగుతుందని విశ్వాసం. అందువల్ల వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైంది 21 పత్రపూజ అని, వీటిలో గరిక (దూర్వాపత్రం)తో వినాయక స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. గణనాథుడికి ఎక్కువ ఇష్టమైన గరికను విఘ్నేశ్వర పూజలో జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలి.  
 
యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు.. అగ్ని సంబంధిత తేజస్సుతో పుట్టడం వల్ల అతని శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాల్ని బాధిస్తుంటాయి. ఆ సమయంలో గణేశుడిని దేవేంద్రుడైన ఇంద్రుడు ప్రార్థించగా.. విఘ్నేశ్వరుడు అనలాసురుడిని నమిలి మింగేస్తాడు.
 
ఫలితంగా గణపయ్య బొజ్జలో అధిక ఉష్ణం జనించి, తాపం కలుగుతుంది. అమృతాలతో అభిషేకించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు ముక్కంటి అయిన పరమేశ్వరుడు జంట గరికపోచలతో గణేశ్వరుడిని పూజచేయాలని సూచిస్తాడు. పరమేశ్వరుని సలహాతో దేవతలు గణపతిని పూజిస్తారు. ఆ గరిక పూజతో గణపతి తాపం చల్లారిపోతుంది. అప్పటి నుంచి గణపతికి గరిక ప్రీతిపాత్రమైందని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఆరేళ్ల క్రితం అదృశ్యమై.. అస్థిపంజరంగా కనిపించాడు..

సభ్యత్వ డ్రైవ్‌‌లో జనసేన అదుర్స్.. ఒకే రోజులో లక్షకు పైగా కొత్త సభ్యులు

హైదరాబాద్ శివార్లలో ఏఐ సదుపాయాలతో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన పూజారి కన్నుమూత

నాకు పవన్ కల్యాణ్ బిగ్ బ్రదర్.. కష్టకాలంలో అండగా నిలిచారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-02-06 బుధవారం ఫలితాలు - రుణ సమస్య తొలగుతుంది

24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments