Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు మార్పులు.. పూర్తయ్యాకే సచివాలయంలోకి జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ?

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (18:11 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముహూర్తాలను ఈ మధ్యకాలంలో బలంగా విశ్వసిస్తున్నారు. తాజాగా సచివాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. కేబినెట్ ప్రమాణస్వీకారం కూడా ముహూర్తం ప్రకారమే చేయనున్నారు. 
 
సచివాలయంలో మార్పుల కోసం వాస్తు నిపుణుల సూచనలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారం మూసి వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌‌ను కూడా మార్చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే సీఎస్ ఛాంబర్‌ను ఆగ్నేయం నుంచి మరో చోటకు మారుస్తున్నారు. పాత ఛాంబర్ పక్కనే మరో కొత్త ఛాంబర్ నిర్మాణానికి అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు ప్రకారం మార్పులు పూర్తి చేశాక సచివాలయ ప్రవేశం చేస్తారు. 
 
అలాగే తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జూన్ 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రివర్గ కూర్పుపై జగన్ నేతలతో చర్చిస్తారని సమాచారం. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయ సమాచారం. జగన్ నేతృత్వంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments