వాస్తు మార్పులు.. పూర్తయ్యాకే సచివాలయంలోకి జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ?

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (18:11 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముహూర్తాలను ఈ మధ్యకాలంలో బలంగా విశ్వసిస్తున్నారు. తాజాగా సచివాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. కేబినెట్ ప్రమాణస్వీకారం కూడా ముహూర్తం ప్రకారమే చేయనున్నారు. 
 
సచివాలయంలో మార్పుల కోసం వాస్తు నిపుణుల సూచనలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారం మూసి వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌‌ను కూడా మార్చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే సీఎస్ ఛాంబర్‌ను ఆగ్నేయం నుంచి మరో చోటకు మారుస్తున్నారు. పాత ఛాంబర్ పక్కనే మరో కొత్త ఛాంబర్ నిర్మాణానికి అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు ప్రకారం మార్పులు పూర్తి చేశాక సచివాలయ ప్రవేశం చేస్తారు. 
 
అలాగే తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జూన్ 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రివర్గ కూర్పుపై జగన్ నేతలతో చర్చిస్తారని సమాచారం. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయ సమాచారం. జగన్ నేతృత్వంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments