ఆలయ నిర్మాణంలో వాస్తు దోషాలను సరిచేస్తున్న పరమశివుడు...

భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుండి భువికి దిగివచ్చిన దేవుడు శివుడు. భక్తుల ద్వారా వెలుగును చూసిన శైవ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో ఉంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం, భగవంతుడు తన ఆ

Webdunia
సోమవారం, 30 జులై 2018 (11:43 IST)
భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుండి భువికి దిగివచ్చిన దేవుడు శివుడు. భక్తుల ద్వారా వెలుగును చూసిన శైవ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో ఉంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం, భగవంతుడు తన ఆచూకీని తెలిపి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. భక్తులు నిర్మిస్తోన్న ఆలయాన్ని స్వామి దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాస్తు దోషాలను సరిచేసిన సంఘటన ఈ క్షేత్రంలో కనిపిస్తుంటుంది.
 
చెన్నబసప్ప అనే భక్తుడు స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడి కొండపై ఆలయాన్ని నిర్మించడం మెుదలుపెడతాడు. తన భార్యతో సహా కొంతమంది కూలీలు కూడా ఈ పనిలో పాల్గొనేవాళ్లు. రోజంతా కష్టపడి పనిచేసి ఈ కొండపైనే నిద్రించేవారు. మరుసటి రోజు పనిలోకి వెళ్లిన వాళ్లకి అంతకు ముందురోజు వాళ్లు చేసిన పనికి సంబంధించిన మార్పులు కనిపించడంలో ఆశ్చర్యపోతారు. ఈ మార్పులు ఎవరు చేస్తున్నారో వాళ్లకి అర్థంకాలేదు.
 
అలాంటి పరిస్థితుల్లో చెన్నబసప్ప భార్యకి ఒక రాత్రి ఏదో అలికిడి వినిపించిదట. ఆ అలికిడితో లేచి చూసిన ఆమెకు శివుడు ఆయన గణాలు ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను సరిచేస్తు కనిపించారట. ఆ దృశ్యాన్ని చెన్నబసప్పకు ఆమె చూపించింది. అలా ఇక్కడి ఆలయ నిర్మాణఁ పరమశివుడి పర్యవేక్షణలోనే జరిగిందని పురాణంలో చెప్పబడుతోంది. శివుడు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైననదిగా చెప్పబడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments