Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో డిజిటల్ కరెన్సీ : బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ రూపీ

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:51 IST)
దేశంలో త్వరలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఈ డిజిటల్ కరెన్సీని వెల్లడించారు. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంకు ఈ డిజిటల్ కరెన్సీని తయారు చేయనుంది. దీన్ని బ్లాక్ చైనా టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని విత్తమంత్రి ప్రకటించారు. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న బిట్ కాయిన్, ఎథీరియం తదితర క్రిప్టో కరెన్సీలకు మూలం బ్లాక్ చైన్ టెక్నాలజీనే. ఈ సాంకేతిక పరిజ్ఞానం భద్రతా పరంగా ఎంతో పటిష్టమైనది. నకీలకు అవకాశాలు ఉండదు. భవిష్యత్ టెక్నాలజీగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారమన్ చేసిన తన ప్రసంగంలో "డిజిటల్ కరెన్సీ (రూపీ) అన్నది మరింత సమర్థవంతమైన, చౌక కరెన్సీ నిర్వహణ విధానం కనుక బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీ సాయంతో డిజిటల్ రూపీని ఆర్బీఐ తీసుకునిరావడాన్ని ప్రతిపాదిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే నగగు నిల్వ మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments