Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఐటీ శ్లాబులతో ఎలాంటి నష్టం ఉండదట.. ఎలాగంటే...

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:15 IST)
ఈనెల ఒకటో తేదీన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ 2020-21ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను (ఐటీ)కు సంబంధించి మినహాయింపులు, తగ్గింపులు లేకుండా కొత్త శ్లాబులు ప్రకటించారు. ఈ శ్లాబులపై గందరగోళం కొనసాగుతోంది. ఈ గందరగోళానికి తెరదించేందుకు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ప్రయత్నించారు. 
 
ఈ కొత్త శ్లాబుల విధానంతో ఎవరికీ నష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 'ఏ విధానం ప్రయోజనకరం, ఏది కాదని మేము చెప్పడం లేదు. ఆ విషయం ఐటీ చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఆంక్షలూ పెట్టం. కొత్త విధానం ఎవరికీ హాని చేయకపోయినా, కొందరికి మాత్రం మేలు చేస్తుంది. ఒక్కరు కూడా ఈ కొత్త విధానంతో నష్టపోరు' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే ఐటీ శ్లాబులను ఎంచుకునే విషయంలో ప్రతి పన్ను చెల్లింపుదారునికి స్వేచ్ఛ ఉందనీ, అందువల్ల ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఐటీ చెల్లించే వారిలో 30-40 శాతం మందికి కొత్త విధానం ఎక్కువ ప్రయోజనకం చేకూర్చే అవకాశం ఉందన్నారు. అలా చూసినా అది పెద్ద విషయమేని చెప్పారు. ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ వంటి సౌకర్యంలేని చిన్న వ్యాపారులు, దుకాణాల యజమానులకు కొత్త శ్లాబుల విధానం మేలు చేస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments