Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2018 : పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ రంగాల అభివృద్ధికి నిధులు కేటాయించారు.

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (12:06 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ రంగాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ముఖ్యంగా. విద్యారంగానికి ఆయన నిధులు భారీ ఎత్తున కేటాయించారు. ఇందులోభాగంగా, విద్యా రంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు కేటాయించారు. 
 
అలాగే, గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు, మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు, ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్‌ సెంటర్లు, వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు, ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు, రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని ఆయన ప్రకటించారు. 
 
అలాగే, క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600 కోట్లు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. ముద్ర యోజన కింద చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే యోచన ఉన్నట్టు తెలిపారు. జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60 వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపుచేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments