Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్షిక బడ్జెట 2023-24 : కొత్త పన్ను విధానం ఇలా...

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (17:10 IST)
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. లక్షలాది మందికి ప్రయోజనం చేకూరేలా వ్యక్తిగత పన్ను రిబేట్‌ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదాయపన్నుకు సంబంధించిన కొత్త విధానాన్ని ఆమె ప్రవేశపెట్టారు. 
 
రూ.7 లక్షల ఆదాయం వరకు ఉన్న వ్యక్తులకు మినహాయింపులు ఉపయోగించుకుని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే, పన్ను చెల్లించు శ్లాబుల సంఖ్యను ఐదుకు తగ్గిస్తున్నట్టు తెలిపారు. కొత్త పన్ను విదానం డిఫాల్టుగా అమలుకానుంది. ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలివేశారు. 
 
కొత్త పన్ను విధానాన్ని పరిశీలిస్తే.. 
* రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* శ్లాబుల సంఖ్య 5కు తగ్గింపు. పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంపు. 
* రూ.0-3 లక్షలు ఆదాయం. ఎలాంటి పన్ను ఉండదు. 
* రూ.3-6 లక్షల ఆదాయం వరకు - 5 శాతం పన్ను
* రూ.6-9 లక్షల వరకు 10 శాతం పన్ను
* రూ.9-12 లక్షల వరకు 15 శాతం పన్ను 
* రూ.12-15 లక్షల వరకు 20 శాతం పన్ను 
* రూ.15 లక్షలకు పైగా ఆదాయం వచ్చేవారు 30 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments