Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకేనా పెట్రోల్ రేట్ తగ్గించింది? ఏం తెలివి మోడీజీ?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (20:17 IST)
ఎన్నికలంటే అందరికీ భయమే. ఎన్నికల్లో అధికారంలోకి వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. అధికారంలోకి రావాలంటే ప్రజలు నమ్మాలి. ఓటెయ్యాలి. ఇదంతా తెలిసిందే. అయితే ఉన్నట్లుండి కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించడమేంటని అందరూ అనుకుంటూ ఉన్నారు. 

 
అయితే ఇందులో మోడీ ప్లాన్ ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ మూడు లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బిజెపి అగ్రనేతలు మేల్కొన్నారు. 

 
మరికొన్నిరోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పనసరిగా భావించారట. అందుకే ఉన్నట్లుండి దీపావళి కానుక అంటూ 5 రూపాయల దాకా పెట్రోల్ రేటును తగ్గించారట. 

 
అంతేకాదు బిజెపి పాలిత రాష్ట్రాలైన అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు వ్యాట్‌లో కోత కూడా విధించాయి. దీంతో భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయట. ఇక నుంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా నిర్ణయాలు ఉండాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట మోడీ. 

 
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటి రెండుసార్లు ఆలోచించాలని.. అలాగే నిపుణులు సలహాలు కూడా తీసుకోవాలని కూడా మోడీ సూచిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments