వాళ్లు చెప్పినట్లే.... మన మిగ్‌లు యుద్ధానికి పనికిరావా? ఇలా కూలిపోతున్నాయేంటి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (22:23 IST)
మొన్నామధ్య మనదేశంలో వున్న మిగ్ 21 విమానాలన్నీ పాతచింతకాయ పచ్చడిలాంటివనీ, యుద్ధంలో ఎందుకూ పనికిరానివంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పెద్ద కథనం వచ్చింది. ఆ కథనాన్ని నిజం చేసేలా మన మిగ్ విమానాలు వరుసబెట్టి కూలిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని బికనీర్‌లో ప్రమాదం జరిగింది. మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది.
 
ఈ యుద్ధ విమానం బికనీర్ సమీపంలోని నాల్ వద్ద కూలింది. ఐతే మిగ్‌లో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గతవారం భారత్‌పై పాకిస్థాన్ దాడులకు దిగడంతో మిగ్ 21 బైసన్‌లో ప్రయాణించిన భారత్ పైలట్ సైతం యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా అది కూలడంతో పాకిస్థాన్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు విదితమే. ఈ రోజు కూడా మిగ్ కూలిన ఘటన పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఓ మిషన్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన మిగ్ 21 బైసన్‌ను పక్షి ఢీకొట్టినట్లు కొందరు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే పక్షి మిగ్‌ని ఢీకొని ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు. ఏమైనా కాలం చెల్లిన యుద్ధ విమానాలు భారత్‌కు తెల్ల ఏనుగులుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే భారతదేశ యుద్ధ సామగ్రి యుద్ధం వస్తే 10 రోజుల్లో ఖాళీ అయిపోతాయంటూ వార్తలు వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అటుంచితే మిగ్ విమానాలు వరసబెట్టి కూలిపోవడం ఇపుడు కలవరపెడుతున్న అంశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన

Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్

Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments