Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూలిన మరో మిగ్ 21 బైసన్ జెట్..

కూలిన మరో మిగ్ 21 బైసన్ జెట్..
, శుక్రవారం, 8 మార్చి 2019 (17:05 IST)
రాజస్థాన్‌లో ఇవాళ ఫైటర్ జెట్ మిగ్ 21 బైసన్ కుప్పకూలింది. ఈ యుద్ధ విమానం బికనీర్ సమీపంలోని నాల్ వద్ద కూలినట్లు తెలుస్తోంది. కాగా మిగ్‌లో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గతవారం భారత్‌పై పాకిస్థాన్ దాడులకు దిగడంతో మిగ్ 21 బైసన్‌లో ప్రయాణించిన భారత్ పైలట్ సైతం యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా అది కూలడంతో పాకిస్థాన్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు. 
 
అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు విదితమే. ఈ రోజు కూడా మిగ్ కూలిన ఘటన పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఓ మిషన్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన మిగ్ 21 బైసన్‌ను ఏదో ఢీకొట్టినట్లు కొందరు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే పక్షి మిగ్‌ని ఢీకొని ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు. ఏమైనా కాలం చెల్లిన యుద్ధ విమానాలు భారత్‌కు తెల్ల ఏనుగులుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో పెళ్లి చేసుకున్నాడని.. ఒళ్లు మండి రెండో భార్య చంపేసింది..