Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కి ప్రధాని మోదీ పెద్దపీట... డిప్యూటీ స్పీకర్ పదవి?

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (18:48 IST)
దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ వైసీపి. ఇపుడా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి కేంద్రంలో పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఎంపీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారంటూ ప్రచారం సాగుతోంది. 
 
ఇందులో భాగంగా భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే జీవీఎల్ మాత్రం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాను.. రాష్ట్ర అభివృద్ధి, సమస్యలపై మాట్లాడాను.. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వంతో సహకారంపై చర్చించినట్లు చెప్పారు.
 
తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. స్పెక్యులేషన్‌లకు తను సమాధానం చెప్పలేననీ, డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీ ఎంపీకి ఇవ్వడం విషయంపై తనకు సమాచారం లేదన్నారు. ఇలాంటివన్నీ బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments