మాంసాహారానికి, శాకాహారానికి ఒకే గరిటె వాడితే ఎలా? సుధామూర్తి

Webdunia
బుధవారం, 26 జులై 2023 (16:46 IST)
రచయిత్రి, సామాజికవేత్త సుధామూర్తి తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 'ఖానే మే కౌన్ హై' అనే యూట్యూబ్ సిరీస్‌లో ఇటీవల ఇంటర్వ్యూ ఎపిసోడ్‌లో కనిపించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య, తాను స్వచ్ఛమైన శాకాహారిని అని తెలిపారు. 
 
అయితే శాకాహారానికి, మాంసాహార వంటకాలకు చాలా ప్రాంతాల్లో ఒక గరిటెను ఉపయోగించడం తనకు ఆందోళన కలిగించే విషయమని సుధామూర్తి తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న సుధామూర్తి ఆహార విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట. 
 
"నేను స్వచ్ఛమైన శాకాహారిని, గుడ్లు, వెల్లుల్లి కూడా తినను, నాకు భయం ఏమిటంటే, శాఖాహారం, మాంసాహారం రెండింటికీ ఒకే చెంచా ఉపయోగించబడుతుందని, ఇది నా మనస్సును చాలా బాధిస్తుంది! " అని శ్రీమతి మూర్తి అంగీకరించారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు శాకాహార రెస్టారెంట్లను వెతుకుతానని లేదా తన భోజనాన్ని తానే సిద్ధం చేసుకుంటానని కూడా చెప్పారు. 
 
తన సొంత బ్యాగ్‌లో ఆహారాన్ని తీసుకెళ్తానని.. అలాగే సులభంగా వేడి చేయగల వంట వస్తువులను తనతో పట్టుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం శ్రీమతి మూర్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కొంతమంది నెటిజన్లు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకువెళ్లడం నిజంగా మంచి పద్ధతి అని అంగీకరించగా, మరికొందరు విభేదించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments