తల్లి ఆవును కొట్టిన వ్యక్తిని దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:14 IST)
Cow calf
మూగ జీవాలు పిల్లల్నీ కాపాడుకోవాలని తల్లి ఏ విధంగా పోరాడుతుందో, పిల్లలు కూడా తల్లి కోసం అలాగే చేస్తాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తల్లిని కొట్టిన ఓ వ్యక్తిని ఆవుదూడ ఎగరి ఓ తన్ను తన్నింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంతా నంద దీన్ని పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు కర్మ అనుభవించక తప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ వీడియోలో ఓ డైరీ ఫాంలో ఆవుల గుంపు దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ ఆవులను పక్కకు వెళ్లాలంటూ కర్ర తీసుకొని కొట్టాడు. హేయ్‌ హేయ్ అంటూ బెదిరించాడు. అంతలోనే ఆ పక్క నుంచి ఆవు దూడ పెరిగెత్తుకు వచ్చింది.
 
అంతేకాకుండా కోపంతో పైకి ఎగిరి వెనక కాళ్లతో బలంగా తన్నింది. అతడు వెనక్కి పేడలో పడిపోయాడు. దీంతో అతని తెల్ల చొక్కా కాస్తా పేడమయం అయింది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోయాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇది చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments