Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి బాంబు పేలుళ్ళ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (08:46 IST)
గత 2006లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన వలీ ఉల్లా ఖాన్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో వలీ ప్రధాన సూత్రధారి కావడంతో ఆయనకు ఘజియాబాద్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. 
 
2006లో జరిగిన ఈ పేలుళ్లలో 20 మందికిపై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా వంద మందికిపై గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, కేసు విచారణ ఘజియాబాద్ కోర్టులో సాగింది. ఈ మూడు కేసుల్లో ఏ1గా వలీ ఉన్నారు. ఇందులో తొలి కేసులో ఉరిశిక్ష విధించగా, రెండో కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది. 
 
మూడో కేసులో సరైన సక్ష్యాధారాలు లేకపోవడంతో వలీని నిర్దోషిగా విడుదల చేసింది. వారణాసి పేలుళ్ల తర్వాత ఈ కేసులో వలీ తరపున విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ కేసు విచారణను ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ కోర్టు బదిలీ చేసింది. ఇపుడు ఈ కేసు కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments