Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికుడిని చితక్కొట్టిన టీసీలు.. సస్పెండ్ చేసిన రైల్వే శాఖ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (13:21 IST)
ప్రయాణ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు టీసీలు దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వేశాఖ సీరియస్‌గా స్పందించింది. ప్రయాణికుడిపై దాడి చేసిన ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, ముంబై నుంచి జైనగర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా జనరల్ బోగీలో అప్పర్ బెర్త్ సీట్లో కూర్చొనివున్నాడు. ఆ బోగీలోకి వచ్చిన ఇద్దరు టీసీలు ఆప్రయాణికుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకరు సదరు ప్రయాణికుడిని కాలు పట్టుకుని కిందకు లాగిపడేశాడు. ఆ తర్వాత బూటుకాలితో నడుంపై తన్నగా మరో టీసీ ముఖంపై తన్నాడు. 
 
దీంతో ఇతర ప్రయాణికుులు టీసీలను నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ దాడి ఘటనను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సీరియస్‌గా తీసుకుని ఇద్దరు టీసీలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments