Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికుడిని చితక్కొట్టిన టీసీలు.. సస్పెండ్ చేసిన రైల్వే శాఖ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (13:21 IST)
ప్రయాణ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు టీసీలు దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వేశాఖ సీరియస్‌గా స్పందించింది. ప్రయాణికుడిపై దాడి చేసిన ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, ముంబై నుంచి జైనగర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా జనరల్ బోగీలో అప్పర్ బెర్త్ సీట్లో కూర్చొనివున్నాడు. ఆ బోగీలోకి వచ్చిన ఇద్దరు టీసీలు ఆప్రయాణికుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకరు సదరు ప్రయాణికుడిని కాలు పట్టుకుని కిందకు లాగిపడేశాడు. ఆ తర్వాత బూటుకాలితో నడుంపై తన్నగా మరో టీసీ ముఖంపై తన్నాడు. 
 
దీంతో ఇతర ప్రయాణికుులు టీసీలను నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ దాడి ఘటనను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సీరియస్‌గా తీసుకుని ఇద్దరు టీసీలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments