Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి సెగ్మెంట్‌లోని స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:52 IST)
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. 
 
ఈ పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల మేరకు కరెంట్ బిల్లు వచ్చింది. ఊహించని ఈ పెను ఉత్పాతాన్ని చూసి పాఠశాల యాజమాన్యం షాక్‌కు గురైంది. విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోయిందని స్కూలు సిబ్బంది వాపోతున్నారు. 
 
పైగా, ఈ మొత్తాన్ని ఈ నెల ఏడో తేదీలోపు చెల్లించని పక్షంలో పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ఈబీ అధికారులను వివరణ కోరగా, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదనీ, గతంలోనూ ఇదే విధంగా వచ్చిందని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments