Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతంత్ర్య పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయాం : ఉక్రెయిన్ అధినేత ఆవేదన

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (12:20 IST)
స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా తమ దేశంపై దాడికి దిగితే నాటో దేశాలతో పాటు తమ మిత్ర దేశాలు తమకు అండగా నిలుస్తాయని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేదని ఆయన వాపోయారు. 
 
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా.. అన్ని వైపుల నుంచి భీకర దాడులు చేస్తుంది. భూతలం, గగనతలం అనే తేడా లేకుండా అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంది. మరోవైపు, ప్రపంచ దేశాల ఆదేశాలను సైతం రష్యా ధిక్కరించి ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తుంది. 
 
ఈ పరిణామాలపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ స్పందిస్తూ, రష్యాతో జరుగుతున్న పోరులో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రష్యా తమపై దాడికి పూనుకుంటే ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని, కానీ, అలాంటిదేమీ జరగలేదని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని పేర్కొన్నారు. 
 
అసలు మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా లేదా అంటూ తమ మిత్ర దేశాలను ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తమకు మద్దతుగా ఉంటే నాటో కూటమిలోకి మమ్మల్ని తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరంటూ ఆయన నిలదీశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments