Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడి పందాలు: కోడి కాలికి కట్టిన కత్తి తగిలి వ్యక్తి మృతి

కోడి పందాలు: కోడి కాలికి కట్టిన కత్తి తగిలి వ్యక్తి మృతి
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (13:23 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు ఇంకా ఏపీలో జరుగుతూనే వున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంకా కోడి పందాలు ఆగలేదు. కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం అంటూనే పండుగ వెళ్లిపోయినా సంప్రదాయం ముసుగులో ఈ పందాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పెద్ద మండ్యం మండలం కలిచర్ల గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. 
 
కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి ఓ పందెం కోడి దూసుకొచ్చింది. అలా దూసుకొచ్చిన కోడి కాలికి కట్టిన కత్తి తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తికి తీవ్ర రక్తస్రావం ప్రాణాలు కోల్పోవటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.
 
మృతి చెందిన వ్యక్తి చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామంలో గంగులయ్య అని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష