Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలకు వెళ్లిన ఇద్దరు మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (11:43 IST)
కేరళలోని శబరిమల ఆలయాన్ని మహిళలు వయోబేధం లేకుండా దర్శించుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లిన మరో ఇద్దరు మహిళలకు భంగపాటు తప్పలేదు. శబరికొండకు మరో కిలోమీటరు దూరం వుందనగానే.. ఆ ఇద్దర మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు వెనుదిరగక తప్పలేదు. 
 
పంబా నదీ సమీపంలోనే ఆ ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ నిరాశతో వెనుదిరిగారు. పోలీసుల బృందం రక్షణతో వెళ్లినా.. ఆందోళనకారులు మహిళల్ని అయ్యప్ప దర్శనానికి వెళ్లనివ్వలేదు. ఆదివారం తమిళనాడుకు చెందిన మనిత సంస్థ మహిళల బృందం కూడా శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించింది. 
 
కానీ 11 మంది మహిళలతో కూడిన ఈ బృందం బేస్ క్యాంప్ చేరుకోవడంతో.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో మరో 40మందికి పైగా మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇందుకోసం భద్రతను పెంచినున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments