Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలిందిలా... (Video)

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (11:27 IST)
ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలింది. ఫలితంగా సునామీ సంభవించింది. ఈ రెండు ప్రళయాల కారణంగా ఇప్పటివరకు 220 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది గాయపడగా, వేలాది మంది గల్లంతయ్యారు. 
 
ఇండోనేషియాలోని సుమత్రా, జావా దీవుల మధ్య ఉన్న క్రాకటోవా అగ్నిపర్వతం ఒక్కసారి పేలిపోయింది. దీంతో ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా, బూడిద ఆకాశంలో 500 మీటర్ల మేరకు ఎగిసిపడినట్టు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ వచ్చింది. 
 
ఈ అగ్నిపర్వతం పేలుడుధాటికి సముద్రగర్భంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతోనే సునామీ వచ్చినట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు, ఇండోనేషియా సునామీ పరిశోధనా కేంద్రం అధికారులు వెల్లడించారు. సునామీ వచ్చినప్పుడు 20 అడుగుల ఎత్తులో అలలు వచ్చాయని చెబుతున్నారు. 
 
ఈ కారణంగానే వందల సంఖ్యలో భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయక చర్యలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కారణంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments