Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూతప్ప తొక్కితే బిడ్డలు పుడతారంట...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (11:18 IST)
దేవుడి పాదాన్ని తాకితే భక్తుడి జన్మధన్యమైపోతుంది. కానీ, అనంతపురం జిల్లాలో మాత్రం భూతప్ప పాదాల కింద నలిగితే మాత్రం బిడ్డలు పుడుతారట. అతని పాదాల్లో ఉన్న మాయామర్మమేంటో ఆ మహిళా భక్తులకే తెలియాలి. ఇంతకీ ఈ భూతప్ప కథేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహ స్వామి, జిల్లేలుడుగుంట ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉత్సవమూర్తులను తీసుకొచ్చే అర్చకుల ముందు భూతప్పలు వేషాలు ధరించిన కొంతమంది నృత్యాలు చేస్తూ వస్తుంటారు. స్వామి వారే వీరిలో ఉంటారని నమ్మకం. వారు తొక్కితే పుణ్యం.. దీర్ఘకాలిక రోగాలు... సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. 
 
ఇందుకోసం వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి తడిసిన బట్టల్లోనే ఉపవాసదీక్షలో ఉంటారు. వీరిపై నుంచి భూతప్పలు నడుచుకుంటూ వెళుతారు. వారి పాదస్పర్శ కోసం భక్తులు ఆరాటం చెందుతుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి యేటా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి భూతప్పల చేత తొక్కించుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఇలా తొక్కించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తినా తమ సంప్రదాయం.. ఆచారమని ఇక్కడి భక్తులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments