Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ అత్యున్నత పదవుల్లో ఇద్దరు తెలుగువాళ్లు... నెట్టింట ఫొటో వైరల్

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:18 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ... ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ నిలుచున్న ఫొటో అది.

ప్రమాణ స్వీకారం అనంతరం.. చీఫ్ జస్టిస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించారు. మర్యాదపూర్వకంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతి నమస్కారం చేశారు. ఇప్పుడీ ఫొటోను తెలుగు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు దేశ అత్యున్నత పదవుల్లో ఉండటం సాటి తెలుగువారికి గర్వకారణం అంటూ ట్వీట్ చేస్తున్నారు.

భారత 48వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం ముగియడంతో శనివారం ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఈ పదవిలో కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments