Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త.. : ఢిల్లీ అగ్నిప్రమాద మృతుడి చివరి కాల్

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (16:02 IST)
దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఈ ప్రమాదంలో 45 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఓ కార్మికుడు చేసిన చివరి ఫోన్ కాల్ ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఆ కార్మికుడు చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ముషారఫ్ అలీ (30)గా గుర్తించారు.
 
ఆ ఫోన్‌ కాల్‌లో అతడు మాట్లాడుతూ.. "అన్నయ్యా.. నా చుట్టూ మంటలు దట్టంగా అలముకున్నాయి. మరికాసేపట్లో నేను చనిపోబోతున్నా. మహా అయితే, మరో రెండు మూడు నిమిషాలు అంతే. తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. నేను బతికే అవకాశం ఎంతమాత్రమూ లేదు. దేవుడి దయ ఉంటే తప్ప బతికి బయటపడడం అసాధ్యం. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. రేపు వచ్చి నా మృతదేహాన్ని తీసుకెళ్లు. నేను చనిపోయినట్టు ఇంట్లో పెద్దలకు కూడా చెప్పు" అంటూ బోరున విలపిస్తూ చెప్పాడు. 
 
దీనికి సంబంధించిన ఆడియో ఒకటి ఇపుడు బయటకు వచ్చింది. ఈ ఫోన్ సంభాషణ విన్నవారి హృదయాలు ద్రవించుకుపోతున్నాయి. ముషారఫ్ అలీ నాలుగేళ్లుగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. అతని మృతితో ఆ కుటంబం ఇపుడు రోడ్డున పడింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments