Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు తినాలనిపించి ట్రైన్‌ను ఆపేశాడు.. లోకోపైలట్‌ సస్పెండ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (19:03 IST)
లోకో పైలట్ పెరుగు తినాలనిపించి ఏకంగా ట్రైన్‌ను మధ్యలోనే నిలిపివేశాడు. పాకిస్తాన్‌లో ఈ ఘటనలో వెలుగులోకి వచ్చింది.  ఆ తరువాత విషయం తెలుసుకున్న అధికారులు ఆ లోకోపైలట్‌ను సస్పెండ్ చేశారు. 
 
వివరాల్లోకెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సిటీ ట్రైన్ లాహోర్‌ నుంచి కరాచీ వైపు వెళ్తోంది. అయితే, ట్రైన్ డ్రైవర్ పెరుగు కోసం ట్రైన్‌ను మధ్యలో నిలిపివేశాడు. 
 
స్టేషన్‌లోని ఓ షాపు నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకుని తిరిగి ట్రైన్ ఎక్కాడు. అయితే, ఇదంతా వీడియో రికార్డ్ చేసిన పలువురు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియోను బేస్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కారణంగానే.. రైల్వేల భద్రత, నియంత్రణపై అపోహలు నెలకొంటున్నాయని, అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు నెటిజన్లు. 
 
దీంతో సదరు రైలు లోకో పైలట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ ఇజాజ్-ఉల్-హసన్ షా ప్రకటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments