Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు తినాలనిపించి ట్రైన్‌ను ఆపేశాడు.. లోకోపైలట్‌ సస్పెండ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (19:03 IST)
లోకో పైలట్ పెరుగు తినాలనిపించి ఏకంగా ట్రైన్‌ను మధ్యలోనే నిలిపివేశాడు. పాకిస్తాన్‌లో ఈ ఘటనలో వెలుగులోకి వచ్చింది.  ఆ తరువాత విషయం తెలుసుకున్న అధికారులు ఆ లోకోపైలట్‌ను సస్పెండ్ చేశారు. 
 
వివరాల్లోకెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సిటీ ట్రైన్ లాహోర్‌ నుంచి కరాచీ వైపు వెళ్తోంది. అయితే, ట్రైన్ డ్రైవర్ పెరుగు కోసం ట్రైన్‌ను మధ్యలో నిలిపివేశాడు. 
 
స్టేషన్‌లోని ఓ షాపు నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకుని తిరిగి ట్రైన్ ఎక్కాడు. అయితే, ఇదంతా వీడియో రికార్డ్ చేసిన పలువురు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియోను బేస్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కారణంగానే.. రైల్వేల భద్రత, నియంత్రణపై అపోహలు నెలకొంటున్నాయని, అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు నెటిజన్లు. 
 
దీంతో సదరు రైలు లోకో పైలట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ ఇజాజ్-ఉల్-హసన్ షా ప్రకటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!

ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా ధూం ధాం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్

విజయవాడలో భారీ యుద్ధ సన్నివేశాలకు సిద్ధమవుతున్న హరి హర వీర మల్లు

విశ్వంత్ నటించిన సస్పెన్స్ చిత్రం హైడ్ న్ సిక్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

'దేవర' చిత్రానికి బిజినెస్ జరగలేదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

తర్వాతి కథనం
Show comments