Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో వరదలు.. హాయిగా పడకగదిలో సేదతీరుతున్న పులి.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 18 జులై 2019 (17:12 IST)
అస్సాంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. నివాసాలకు ఇళ్లు లేకుండా సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అస్సాం వరదల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ప్రజలు తగిన వసతులు లేకుండా నానా తంటాలు పడుతున్నారు. 
 
ఇక ఈ వరదల కారణంగా అటవీ ప్రాంతాల్లో వుండే వన్యమృగాలు సైతం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములు ఇళ్లల్లోకి చేరుకుంటున్నాయి. తాజాగా ఓ పులి వరద బాధితుల ఇంట్లోకి చొరబడింది. అక్కడే నివాసం వుంటోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కజిరంగ నేషనల్ పార్కు వుంచి ఈ పులి మానవ సంచార ప్రాంతానికి చేరుకుందని తెలుస్తోంది. 
 
అంతేకాకుండా ఓ ఇంట్లోకి వెళ్ళిన పులి హాయిగా బెడ్ మీద కూర్చుండిపోయింది. ఇలా ఇంట్లోని పడకగదిలో హాయిగా పులిరాజు వున్న ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులు పోస్టు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులిని పట్టుకుని అడవుల్లో వదిలేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments