అస్సాంలో వరదలు.. హాయిగా పడకగదిలో సేదతీరుతున్న పులి.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 18 జులై 2019 (17:12 IST)
అస్సాంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. నివాసాలకు ఇళ్లు లేకుండా సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అస్సాం వరదల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ప్రజలు తగిన వసతులు లేకుండా నానా తంటాలు పడుతున్నారు. 
 
ఇక ఈ వరదల కారణంగా అటవీ ప్రాంతాల్లో వుండే వన్యమృగాలు సైతం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములు ఇళ్లల్లోకి చేరుకుంటున్నాయి. తాజాగా ఓ పులి వరద బాధితుల ఇంట్లోకి చొరబడింది. అక్కడే నివాసం వుంటోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కజిరంగ నేషనల్ పార్కు వుంచి ఈ పులి మానవ సంచార ప్రాంతానికి చేరుకుందని తెలుస్తోంది. 
 
అంతేకాకుండా ఓ ఇంట్లోకి వెళ్ళిన పులి హాయిగా బెడ్ మీద కూర్చుండిపోయింది. ఇలా ఇంట్లోని పడకగదిలో హాయిగా పులిరాజు వున్న ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులు పోస్టు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులిని పట్టుకుని అడవుల్లో వదిలేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments