Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాంబార్ అన్నం తిని పులిరాజు చనిపోయిందా.. ?

సాంబార్ అన్నం తిని పులిరాజు చనిపోయిందా.. ?
, మంగళవారం, 16 జులై 2019 (18:23 IST)
సాంబార్ అన్నం తిని ఓ పులిరాజు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నీలగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అసలే వర్షాలు లేకుండా నీటి కొరత తమిళనాడుకు చుక్కలు చూపిస్తోంది. ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే.. అటవీ ప్రాణులు అంతకంటే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా నీరు, ఆహారం దొరక్కకుండా నీలగిరిలో ఓ పులిరాజు.. చెత్తను తిని ప్రాణాలు కోల్పోయింది. 
 
అటవీ ప్రాంతంలోని చెత్తను తింటూ కాలం గడిపిన పులిరాజు.. సాంబార్ రైస్‌ను తినింది. అంతే వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ పులిరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు దర్యాప్తు జరిపారు. 
 
ఈ పులిరాజు చనిపోయేందుకు కడుపులోకి బ్లేడు ముక్కలు, చెత్త చెదారం, ఇంకా సాంబార్ అన్నం కారణమని తేలింది. అటవీ ప్రాంతాల్లోని క్రూర మృగాలు ఆకలిని తట్టుకోలేక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని భావించి.. గ్రామస్తులు సాంబార్ రైస్‌లో విషం పెట్టి చంపేసివుంటారని అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఐతే ఇదంతా తమిళ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్త. కానీ నిజానికి పులి తిన్నది సాంబార్ జింకను. దీన్ని తినడంతో ఏదో తేడా కొట్టి అది చచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సేవలపై ఉన్నట్లుండి ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారు తిరుమలేశా?