Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇన్ఫోసిస్' సుధామూర్తి గొప్ప మనసు... స్వయంగా సరుకులను ప్యాక్ చేస్తూ.. (Video)

దేశ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త సుధామూర్తి మరోమారు తనలోని గొప్ప మనసును చూపించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసి

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:04 IST)
దేశ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త సుధామూర్తి మరోమారు తనలోని గొప్ప మనసును చూపించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ తరపున వరద బాధితులకు వివిధ రకాల సహాయ సరుకులను అందజేస్తున్నారు.
 
ఈ సరుకుల ప్యాకింగ్‌ కూడా ఇన్ఫోసిస్ సిబ్బందే చేస్తున్నారు. వీరిలో ఒకరు సుధామూర్తి. సంస్థ ఉద్యోగులతో సుధామూర్తి కలిసిపోయి సరుకుల ప్యాకింగ్‌లో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సుధామూర్తి స్వయంగా సరుకులను ప్యాక్‌ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. సామాన్లు సర్దుతున్న బృందంతో కూడా కలిసిపోయి వారికి తనవంతుగా సాయం అందించారు. 
 
సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియోను లక్షలాది మంది చూసి, సుధామూర్తి సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు అమ్మ అనే హ్యాష్ టాగ్‌తో షేర్ చేసుకుంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments