Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహితపై కన్నేశాడు.. అలా వీడియో తీసి మూడేళ్ల పాటు అత్యాచారం?

కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నప్పటికీ మరో వివాహితపై కన్నేశాడు. వివాహిత స్నానం చేస్తుండగా, వీడియో తీసి.. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడ

వివాహితపై కన్నేశాడు.. అలా వీడియో తీసి మూడేళ్ల పాటు అత్యాచారం?
, బుధవారం, 22 ఆగస్టు 2018 (14:05 IST)
కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నప్పటికీ మరో వివాహితపై కన్నేశాడు. వివాహిత స్నానం చేస్తుండగా, వీడియో తీసి.. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఈ ఘటన రాచకొండ కమీషనరేట్ పరిధిలోని చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది. అతడి వేధింపులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువవడంతో తట్టుకోలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పీపల్ పహడ్ గ్రామంలో ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య(45) అనే స్టోన్ కట్టింగ్ వర్కర్ ఈ వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు. ఇందుకోసం సదరు వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. 
 
ఇక అప్పటి నుంచి ఆ మహిళకు నరకం చూపించాడు. తనకు లొంగనట్లైతే.. ఆమె భర్తతో పాటు గ్రామస్తులకు ఈ వీడియో చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇలా బెదిరించి గత మూడేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే అతడి వేధింపులు మరీ శృతిమించడంతో తట్టుకోలేక పోయిన వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ రూ. 21 కోట్ల విరాళం... వారం పాటు ఉచిత వాయిస్