ఖడ్గమృగం దాడి నుండి తృటిలో లక్కీగా తప్పించుకున్నాడు..వీడియో..

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (11:51 IST)
ఖడ్గమృగం ఎలా ఉంటుందో మనం చూసే ఉంటాం, కానీ అది వెంటపడడం ఎప్పుడైనా చూసారా? టూరిస్ట్‌లపైకి అమాంతం ఎలా దూసుకువచ్చిందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ ఘటన సౌత్ ఆఫ్రికన్ సఫారీ పార్క్‌లో జరిగింది. సాధారణంగా చిరుతలు, సింహాలు మరియు ఇతర మృగాలు టూరిస్ట్‌లపై దాడి చేయడం చూస్తూనే ఉంటాం. వీటి బారిన పడి టూరిస్ట్‌లు గాయాలపాలు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 
 
రియాన్ బోసోఫ్ అనే టూరిస్టు సఫారీ పార్కులో వీడియో షూట్ చేస్తూ వెళ్తున్నాడు. తన వాహనంలో ఉండి అక్కడి జంతువులను చూస్తూ వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఒక తెల్లని ఖడ్గమృగం అతడి కంట పడింది. దానిని వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే రియాన్‌ను చూసిన ఖడ్గమృగం వేగంగా చాలాదూరం తరిమింది. కనీసం రెండు నిమిషాల పాటు వెంటాడింది. 
 
వాహనానికి అతి దగ్గరగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించింది. లక్కీగా వాహనం వేగాన్ని పెంచడంతో ఆ టూరిస్ట్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జంతువులలో రెండో అతిపెద్ద జంతువులైన తెల్లని రైనోలు గంటకు 30 మైళ్ల వేగంతో పరుగు తీయగలవు. వైరల్‌గా మారిన వీడియోని మీరు ఓ సారి చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments