Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదల్లో చిక్కుకున్న రైలు ప్రయాణికులు.. రక్షించిన వెస్ట్రన్ నేవీ కమాండ్

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి

Webdunia
బుధవారం, 11 జులై 2018 (10:13 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి కొట్టుకునిపోయాయి. దీంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
 
ఈ పరిస్థితుల్లో నాలా సోపారా - వాసై రోడ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్స్ బాగా దెబ్బతిన్నాయి. దీంతో నాలా సొపొరా స్టేషన్‌లో రైలు ప్రయాణికులు చిక్కుకుని పోయారు. వీరిని మంగళవారం రాత్రి వెస్ట్రన్ నావల్ కమాండ్ సురక్షితంగా రక్షించింది.
 
వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన నేవీ.. భారీ వాహనాల సాయంతో వీరిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గత గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరం నీట మునిగిన విషయం తెల్సిందే. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాదంలో చిక్కున్న ముంబై నగర వాసులను రక్షించే పనుల్లో ఇండియన్ నేవీ నిమగ్నమైవుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments