బ్యాంక్ లాకర్‌లలో డబ్బులు దాచితే.. చెదలు పట్టాయి..

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (11:00 IST)
బ్యాంక్ లాకర్‌లలో డబ్బులు దాచాలి అనుకునేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎందుకుంటే బ్యాంకు లాకర్‌లో పెట్టిన డబ్బుకు చెదలు పట్టాయి. దీంతో ఆ అకౌంట్ హోల్డర్ తలపట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఉదయ్‌పూర్‌లోని కాలాజీ గోరాజీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే...  సునీతా మెహతా అనే అకౌంట్ హోల్డర్, లాకర్ నంబర్ 265లో భద్రపరిచిన తన నోట్లు తెగుళ్ల వల్ల 15వేల విలువ గల నోట్లు పూర్తిగా పాడైపోయాయని, రూ.500 నోట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని గుర్తించారు. సునీత వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయగా, పురుగు సోకడంతో పోగొట్టుకున్న రూ.15 వేలు తిరిగి చెల్లించారు. 
 
ఈ సంఘటన బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్న ఇతర ఖాతాదారులను ఆందోళనకు గురిచేసింది. బ్యాంకు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఖాతాదారులు ఆరోపించడంతో.. బ్యాంక్ క్షమాపణలు కోరుతూ.. సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments