Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి : కేంద్ర హోం శాఖ ఆదేశం

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి కేంద్రం హోం శాఖ లేఖ రాసింది. పైగా, ఆయనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 
 
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోఅక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్ వంటివి జరుగుతున్నాయంటూ ప్రముఖ న్యాయవాది గూడాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం శాఖకు గత అక్టోబరు నెలలో ఫిర్యాదు చేశారు. 
 
ప్రతిపక్ష నేతలు, విపక్ష పార్టీలకు చెందిన నేతలతపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిగా నడుచుకోవాల్సిన ఆయన తన పరిధిని దాటి అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని గూడపాటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ లేఖపై కేంద్ర హోం శాఖ స్పందించింది. సునీల్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా ఉన్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టడమే కాకుండా శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురిచేశారు. లోక్‌సభ సభ్యుడు అనే విషయం కూడా మరిచి ఆయనపై భౌతికంగా దాడులు చేయించాడు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments