Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల పరంపర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పరిస్థితి గురించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై వివరించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. తెలంగాణలో తలెత్తిన పరిస్థితులకు సంబంధించి గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
మొత్తమ్మీద టీఎస్ ఆర్టీసి దెబ్బతో కేసీఆర్ సర్కారుకి షాక్ తప్పేట్లు లేదు. ఉద్యోగులకు- ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరకపోవడంతో ఆర్టీసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనితో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments