Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు సిద్ధం : టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళన ఉధృతం చేశారు. హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ తోట నర్సింహం ప్రకటించారు. అయితే, ముందు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బయటకు వస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. 
 
విజయసాయిరెడ్డికి సిగ్గుందా అని మండిపడ్డారు. పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ అని... కేవలం లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసి ఇతరులు రాజీనామా చేయాలని అనడం సరికాదన్నారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్ధుడు చంద్రబాబు మాత్రమే అని ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. బీజేపీతో వైసీపీ నేతలు లాలూచీ పడ్డారని విమర్శించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడం లేదని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments