Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేటర్లుగా గెలవలేని వారిని కూడా మంత్రులు, ఎమ్మెల్సీలుగా చేశాం : నారా లోకేశ్

విజయవాడ వేదికగ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన్ను నవ్వులపాలు చేసింది. కార్పొరేటర్లుగా గెలవలేనివారిని కూడా

Webdunia
మంగళవారం, 29 మే 2018 (15:48 IST)
విజయవాడ వేదికగ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన్ను నవ్వులపాలు చేసింది. కార్పొరేటర్లుగా గెలవలేనివారిని కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదేనంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సొంత పార్టీ నేతలతో పాటు.. విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, 'చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా నాన్న నన్ను ఊరికి పంపేవారు. అలా పంపేటప్పుడు.. 'పల్లెకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే..' అని పదేపదే గుర్తుచేసేవారు. ఆ విధంగా చిన్నవయసులోనే నాకు పంచాయితీరాజ్‌ మంత్రిగా పల్లెలకు సేవచేసే అవకాశం దక్కిందన్నారు. 
 
స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లలో చేయలేని పనులన్నీ గడిచిన 4 ఏళ్లలో పూర్తిచేశాం. మేము వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు నడుస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న నాపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్లకు దమ్ము, ధైర్యం ఉంటే.. నేను ఎక్కడ, ఎలా తప్పు చేశానో ఆధారాలతో సహా నిరూపించాలి. తన సొంత నియోజకవర్గంలో కట్టాల్సిన సుజల స్రవంతి పథకాన్ని ఉద్దానంకు తరలించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది. ఆయన 68 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా పరుగులు పెడుతున్నారు. 32 ఏళ్ల యువకుడినైన నేనే ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నాను అంటూ గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments