సబ్యసాచితో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ప్రకటనపై ట్రోల్స్...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (19:51 IST)
గతేడాది దీపావళి ప్రకటన కారణంగా టాటా గ్రూప్ నగల బ్రాండ్ తనిష్క్ వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తనిష్క్‌ను బహిష్కరించాలని ట్రోలర్లు చేశారు. తనిష్క్ హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. అయితే, వివాదం ముదిరినప్పుడు, తనిష్క్ ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
 
 
దీని తర్వాత ఇటీవల ఫ్యాబ్ ఇండియాపై వివాదం నెలకొంది. దీపావళి పండుగను 'జష్న్-ఎ-రివాజ్' అని పిలువడం ద్వారా ఫ్యాబ్ ఇండియా తన దుస్తులను ప్రమోట్ చేసింది. హిందువుల దీపావళి పండుగకు జష్న్-ఇ రివాజ్ అనే ఉర్దూ పేరు పెట్టడంలో అర్థం ఏంటనే విమర్శించారు. ఈ వివాదం తర్వాత, ఫ్యాబ్ ఇండియా కూడా సోషల్ మీడియా నుండి తన ప్రకటనను తీసివేయవలసి వచ్చింది.
 
 
ఇప్పుడు మరోసారి ఓ ప్రకటనపై దుమారం రేగింది. ఇప్పుడు ఫ్యాషన్- జ్యువెలరీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ యొక్క కొత్త ప్రకటన ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌లో మంగళసూత్ర ప్రకటనకు సంబంధించిన కొన్ని మోడల్స్ చిత్రాలు ఉన్నాయి. చాలామంది ఈ ఫోటోలను అశ్లీలంగా, నగ్నంగా పేర్కొంటూ వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ప్రజలు రాస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments