Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామును తింటే కరోనా చనిపోతుందట.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (12:51 IST)
కరోనాను జయించేందుకు రకరకాల వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అందులో చాలా వరకు కట్టుకథలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే.. వ్యూస్ కోసమో.. లేక మరేదో ప్రయోజనం కోసమో ఈ తరహా వీడియోలకు ఇంటర్నెట్‌లో కొదువే లేదు.
 
కాగా.. ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా పామును తింటే కరోనా రాదని తాను స్వయంగా పామును తింటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఈ వీడియోకు ఎక్కడలేని ప్రచారం వచ్చేసింది. పామును తింటే కరోనా సంగతేమో కానీ మరేదో రోగం వచ్చి ఏకంగా కైలాసానికి పోవడం ఖాయమని కాస్త లోకజ్ఞానం ఎరిగిన వారికి తెలియనిది కాదు.
 
అయితే.. ఈయన మాత్రం కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఈ పాములో పుష్కలంగా ఉన్నాయని.. అందుకే ఇది తింటే కరోనా రాదని వీడియోలో చెప్పాడు. ఆయనకి కరోనా రావడంలో ఈ పాము ఏ మాత్రం అడ్డుకోలేదని తెలిసిన అంశమే కాగా.. పోలీసులు మాత్రం ఈయన్ని అరెస్ట్ చేసి జరిమానా కూడా విధించేశారు. 
 
తమిళనాడు మదురై జిల్లాలోని పెరుమల్​పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే ఓ రైతు ఓ పామును తింటూ కరోనాకు దివ్యౌషధం అని చెప్పాడు. పామును వడివేలు తింటుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్​లో వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ఇది వైరల్​గా మారింది. ఇది కాస్త అటవీ అధికారులకు చేరడంతో అతనికి రూ.7 వేల రూపాయల జరిమానా విధించి హెచ్చరించి వదిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments