Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కరోనా వైరస్ కలకలం ... ఇద్దరి చైనీయుల్లో కరోనా లక్షణాలు..

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (10:41 IST)
చెన్నై మహానగరంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆదివారం ఉదయం మలేషియా, సింగపూర్ల నుంచి నుంచి చెన్నైకు వచ్చిన విమాన ప్రయాణికుల్లో ఇద్దరికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఒకరిని నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డుకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ రోగి పేరు వల్లూజిన్. చైనా దేశస్థుడు. మలేషియా నుంచి చెన్నైకు రాగా, అతనిలో వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. విమానాశ్రయంలో అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
అలాగే, సింగపూర్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలోనూ ఇవే లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చెన్నై విమానాశ్రయం ఒకే రోజు ఇద్దరి వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో జనం వణుకుతున్నారు. కాగా, ఈ రెండు కేసులకు సంబంధించి అధికారిక సమాచారం అందాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments