Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కరోనా వైరస్ కలకలం ... ఇద్దరి చైనీయుల్లో కరోనా లక్షణాలు..

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (10:41 IST)
చెన్నై మహానగరంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆదివారం ఉదయం మలేషియా, సింగపూర్ల నుంచి నుంచి చెన్నైకు వచ్చిన విమాన ప్రయాణికుల్లో ఇద్దరికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఒకరిని నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డుకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ రోగి పేరు వల్లూజిన్. చైనా దేశస్థుడు. మలేషియా నుంచి చెన్నైకు రాగా, అతనిలో వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. విమానాశ్రయంలో అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
అలాగే, సింగపూర్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలోనూ ఇవే లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చెన్నై విమానాశ్రయం ఒకే రోజు ఇద్దరి వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో జనం వణుకుతున్నారు. కాగా, ఈ రెండు కేసులకు సంబంధించి అధికారిక సమాచారం అందాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments