ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్ళు.. అందుకే ఈ గతి-మాపై శ్రీరెడ్డి ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన సొమ్ము దుర్వినియోగం అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై మండిపడుతూ.. వెరైటీగా పో

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:03 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన సొమ్ము దుర్వినియోగం అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై మండిపడుతూ.. వెరైటీగా పోరాటం చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్ వైపు మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో ''మా''కి సంబంధించిన ప్రజల సొమ్ముని అధ్యక్షుడు శివాజీరాజా కొందరు సభ్యులతో కలిసి దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై శ్రీరెడ్డి మండిపడింది. 
 
శివాజీ రాజాపై ఆరోపణలు చేస్తూ కౌంటర్ ఎటాక్‌గా మా ప్రధాన కార్యదర్శి నరేష్ మరో ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి నిజాలను బయటపెట్టే ప్రయత్నాలు చేశారు. శ్రీరెడ్డి విషయంలో కూడా శివాజీరాజా సొంత నిర్ణయాలు తీసుకున్నారని, మా తీరుని తప్పుబట్టారు.
 
తాజాగా నరేష్ వ్యాఖ్యలపై స్పందించిన నటి శ్రీరెడ్డి.. శివాజీరాజాపై మండిపడింది. తాను చేస్తున్న పోరాటాన్ని శివాజీ రాజా, శ్రీకాంత్ ఇద్దరూ పబ్లిసిటీ స్టంట్ అన్నారని ఎత్తిచూపింది. అందుకే వారికి ప్రస్తుతం దరిద్రపు గతి పట్టిందని దుమ్మెత్తిపోసింది. తాను మోసపోయి వస్తే ఓదార్చిల్సిందిపోయి.. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలని కాపాడే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. 
 
తనకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీరాజా అతడి తొత్తులు ప్రయత్నం చేస్తే.. తాను తీసుకోలేదని చెప్పింది. తన విషయంలో శివాజీరాజా ప్రవర్తన బాధాకరమని శ్రీరెడ్డి తెలిపింది. ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్ళు. సెటిల్మెంట్స్ చేసే గూండాలు. అందరూ తోడుదొంగలే.. ఆ డబ్బంతా పంచుకొని తిన్నారు. ఆ మొత్తంలో ఓ బడా హీరో వాటా చాలా పెద్ద మొత్తం. అమెరికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉందంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్లు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments