Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు ఏం అవసరమొచ్చందనీ రాఫెల్ జెట్ ఫైటర్లు? : పాకిస్థాన్ అక్కసు

Webdunia
గురువారం, 30 జులై 2020 (19:06 IST)
భారత్‌కు ఏం అవసరం వచ్చిందని రాఫెల్ జెట్ ఫైటర్లు కావాల్సి వచ్చిందని పాకిస్థాన్ తనలోని అక్కసును వెళ్లగక్కింది. పైగా, భారత్ తన రక్షణ అవసరాలకు మించి ఆయుధాలను సమకూర్చుకుంటోందంటూ గగ్గోలు పెడుతోంది. 
 
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా 36 రాఫెల్ జెట్ ఫైటర్ విమానాలను రూ.59 వేల కోట్ల వ్యయంతో భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా, తొలి దశలో ఐదు రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్‌కు పంపించింది. ఇవి బుధవారం మధ్యాహ్నం భారత గడ్డను ముద్దాడాయి. ఈ జెట్ ఫైటర్లకు ఇండియన్ ఆర్మీ జల ఫిరంగులతో స్వాగతం పలికారు.
 
హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానికదళ కేంద్రంలో ల్యాండ్ అయిన రాఫెల్ జెట్లను చూసిన పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. భద్రతా అవసరాలకు మించి సైనిక సామర్ధ్యాలను భారత్ కూడగట్టుకుంటోందని పాకిస్థాన్ తన కుళ్లుబోతుతనాన్ని మరోసారి ప్రదర్శించింది.
 
రాఫెల్ విమానాలు ఇప్పుడు భారత్‌కు ఏం అవసరం, వారు భద్రతకు కావాల్సిన సైనిక సామర్ధ్యాలను మించి కూడగట్టుకుంటున్నారని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. దక్షిణ ఆసియాలో ఆయుధ పోటీకి దారితీసే భారతదేశాన్ని అసమానమైన ఆయుధాల సేకరణ నుంచి నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్ కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments