Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ - బీఎస్పీ పొత్తు ఎఫెక్టు : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి నష్టం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అపార నష్టం వాటిల్లనుంది. ఈ పొత్తు కారణంగా బీజేపీకి ఏకంగా 30 నుంచి 40 ఎంపీ సీట్లను కోల్పోనుందట. ఈ విషయాన్ని ఎన్డీయే కీలక భాగస్వా

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (10:21 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అపార నష్టం వాటిల్లనుంది. ఈ పొత్తు కారణంగా బీజేపీకి ఏకంగా 30 నుంచి 40 ఎంపీ సీట్లను కోల్పోనుందట. ఈ విషయాన్ని ఎన్డీయే కీలక భాగస్వామి, ఆర్పీఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎస్పీ-బీఎస్పీ పొత్తు వల్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 25 నుంచి 30 సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సవాలు చేసే సత్తా.. కాంగ్రెస్‌కు గానీ, రాహుల్‌ గాంధీకి గానీ, ఎస్సీ, బీఎస్పీలకు గానీ లేదన్నారు. 
 
2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 50కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని, ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇదేమీ ప్రతిబంధకం కాదని అథవాలే అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి యూపీలో 73 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ.. రాయ్‌బరేలీ, అమేథీలకే పరిమితం కాగా.. సమాజ్‌వాదీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయి. ఇటీవల ఫుల్‌పూర్‌, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో గెలిచిన ఎస్పీ తన స్థానాల సంఖ్యను ఏడుకు పెంచుకుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments