నిజమైన ప్రాణదాత : 22 మంది ప్రాణాలు రక్షించిన సోనూసూద్

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:37 IST)
దేశంలో కరోనా  కష్టకాలం సాగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలను చూసి వెండితెరపై కరుడుగుట్టిన విలన్‌గా కనిపించే నటుడు సోనూ సూద్ చలించిపోయారు. దీంతో నిజజీవితంలో హీరోగా అవతారమెత్తారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారు. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. కర్ణాటకలోని సోనూసూద్‌ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది.
 
బెంగళూరులోని అరక్‌ హాస్పిటల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం అందింది. సకాలంలో ప్రాణవాయువు అందక ఇప్పటికే అక్కడ ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించిన సోనూసూద్‌ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్‌ హాస్పిటల్‌కి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించింది. వాటిద్వారా ఆ 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలిచిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments