Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన ప్రాణదాత : 22 మంది ప్రాణాలు రక్షించిన సోనూసూద్

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:37 IST)
దేశంలో కరోనా  కష్టకాలం సాగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలను చూసి వెండితెరపై కరుడుగుట్టిన విలన్‌గా కనిపించే నటుడు సోనూ సూద్ చలించిపోయారు. దీంతో నిజజీవితంలో హీరోగా అవతారమెత్తారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారు. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. కర్ణాటకలోని సోనూసూద్‌ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది.
 
బెంగళూరులోని అరక్‌ హాస్పిటల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం అందింది. సకాలంలో ప్రాణవాయువు అందక ఇప్పటికే అక్కడ ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించిన సోనూసూద్‌ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్‌ హాస్పిటల్‌కి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించింది. వాటిద్వారా ఆ 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలిచిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments