Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని అడ్డుకునేందుకు కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకం : అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కుక్కలు, పిల్లలు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమం

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (18:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కుక్కలు, పిల్లలు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విపక్ష పార్టీలు, విపక్ష పార్టీల నేతల వైఖరిని ఆయన తప్పుబట్టారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలని, సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని ఓ వైపు మోడీ కోరుతుంటే... విపక్షాలు మాత్రం సభ జరక్కుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయన్నారు. 
 
అధికారంలో ఉన్న 40 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు కావాలని రాహుల్ అడుగుతున్నారని... కానీ, 40 ఏళ్లలో మీరు చేసిందేమిటంటూ కాంగ్రెస్‌ను ప్రజలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలనే ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments