Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిలపక్ష భేటీకి కాఫీ - టీ కోసం వెళ్లమంటారా?: పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతినిధులను పంపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం సరఫరా చేసే

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (18:21 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతినిధులను పంపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం సరఫరా చేసే బిస్కెట్లు, కాఫీ, టీల కోసం వెళ్ళబోమని ఆయన తేల్చి చెప్పారు. 
 
శుక్రవారం విజయవాడ బెంజి సర్కిల్‌లో ఆయన లెఫ్ట్ పార్టీల నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర అనంతరం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో ఏ తప్పు చేశారో, ఇప్పుడు అమరావతి విషయంలోనూ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేవలం సైబరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా, అంతే విధ్వంసం కూడా జరిగిందని, చిన్న రైతుల నుంచి భూమిని లక్షలకు కొన్న కొందరు బడాబాబులు కోట్లకు పడగలెత్తారని అన్నారు.
 
దీంతో అభివృద్ధిలో తమకు భాగం లేకుండా పోయిందన్న భావన ప్రజల మనసుల్లో చేరిందని, ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ ఆరోపించారు. కేవలం అమరావతిని మాత్రమే చూసుకుంటే, రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించిన ఆయన, పాలకుల తప్పిదాల కారణంగానే అస్థిత్వ పోరు మొదలవుతోందని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments